కోర్టు ఆదేశాలను ప్రభుత్వం పాటించాలి

ABN , First Publish Date - 2022-11-02T23:59:07+05:30 IST

రైతుల పాదయాత్రకు సంబంధించి హైకోర్టు ఆదేశాలను ప్రభుత్వం తప్పనిసరిగా పాటించాలనిటీడీపీ రాష్ట్రఅధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్‌ డిమాండ్‌ చేశారు.

కోర్టు ఆదేశాలను ప్రభుత్వం పాటించాలి
మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్సీ జగదీష్‌

పార్వతీపురం- ఆంధ్రజ్యోతి: రైతుల పాదయాత్రకు సంబంధించి హైకోర్టు ఆదేశాలను ప్రభుత్వం తప్పనిసరిగా పాటించాలనిటీడీపీ రాష్ట్రఅధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్‌ డిమాండ్‌ చేశారు. బుధవారం పార్వ తీపురంలోని టీడీపీకార్యాలయంలో ఆయన విలేకర్లతో మా ట్లాడారు. రైతులు శాంతియుతంగా పాదయాత్ర చేపడు తున్నారని, అయితే అడ్డుకొనేందుకు వైసీపీ నాయకులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నరని ఆరోపించారు. వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న సమయంలో పాదయాత్ర చేస్తే అప్పటి ముఖ్యమంత్రి ఏవిధంగా ఆ పాదయాత్రకు సహకరించారో తెలుసుకోవాలన్నారు. రెవె న్యూ మంత్రి ధర్మాన ప్రసాద్‌రావు పేరుకే మూడు రాజధా నులని, ఒకటే రాజధాని ఉంటుందని మాట్లాడుతున్నారని అన్నారు. స్పీకర్‌ కూడా రైతుల పాదయాత్రపై విమర్శ చే యడం దారుణమన్నారు. రైతులు రాజధాని కోసం ల్యాండ్‌ పూలింగ్‌పై భూమి ఇవ్వడమే తప్పా అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు జి.రవికుమార్‌, ఎం.కార్తీక్‌, కోలా వెంకటరావు, కె.ప్రదీప్‌కుమార్‌. తాన్న ప్రసాద్‌, రెడ్డి శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-02T23:59:13+05:30 IST