వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి: డీఈవో

ABN , First Publish Date - 2022-11-30T00:09:29+05:30 IST

వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిం చి, చదువులో రాణించేలా చూడాలని డీఈవో బి.లింగేశ్వరరెడ్డి ఉపాధ్యా యులకు సూచించారు.

 వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి: డీఈవో

భోగాపురం: వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిం చి, చదువులో రాణించేలా చూడాలని డీఈవో బి.లింగేశ్వరరెడ్డి ఉపాధ్యా యులకు సూచించారు. భోగాపురం ఎమ్మార్సీ ఆవరణలో ఉపాధ్యాయుల కు నిర్వహిస్తున్న శిక్షణా తరగతులను ఆయన మంగళవారం పరిశీలించా రు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ 3 నుంచి 5 తరగతుల్లో వెనుక బడిన విద్యార్థులను గుర్తించి వారిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని, శిక్షణ ఇవ్వాలని సూచించారు. తెలుగు, గణిత సబ్జెక్టుల్లో బేస్‌లైన్‌ టెస్టులు నిర్వ హించి ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. అంతకుముందు శిక్షణకు ఎంతమంది హాజరవుతున్నారు, తదితర వివరాలపై ఆరా తీశారు. అనం తరం ఎయిర్‌పోర్టు ఏర్పా టులో భాగంగా తొలగించ బడుతున్న గూడెపువలస, రెల్లిపేట, ముడసర్లపేట, బైరెడ్డిపాలెం ప్రాథమిక పాఠశాలలను సందర్శించా రు. కార్యక్రమంలో ఎంఈవో రమణమూర్తి, రిసోర్సు పర్సన్లు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-30T00:09:31+05:30 IST