గుంపులోకి మరొకటి!
ABN , First Publish Date - 2022-07-01T05:20:30+05:30 IST
జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో కొన్నేళ్లుగా తిష్ఠ వేసిన గజరాజుల సంఖ్య పెరిగింది. గురువారం ఉదయం ఆ గుంపులో ఉన్న ఏనుగు కొమరాడ మండలం అర్తాం సమీపంలోని తోటల్లో పిల్ల ఏనుగుకు జన్మనిచ్చింది.
సంఖ్యను పెంచుకున్న గజరాజులు
ప్రసవించిన ఏనుగు
పిల్ల ఏనుగుతో కలిపి ఏడుకు చేరిన వాటి సంఖ్య
కొమరాడ, జూన్ 30 : జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో కొన్నేళ్లుగా తిష్ఠ వేసిన గజరాజుల సంఖ్య పెరిగింది. గురువారం ఉదయం ఆ గుంపులో ఉన్న ఏనుగు కొమరాడ మండలం అర్తాం సమీపంలోని తోటల్లో పిల్ల ఏనుగుకు జన్మనిచ్చింది. వాటి దగ్గరకు ఎవరూ వెళ్లకూడదని అటవీశాఖ అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేశారు. వాస్తవంగా ఆరేళ్ల కిందట జిల్లాలోకి ప్రవేశించిన ఎనిమిది ఏనుగులు ఏజెన్సీలోనే సంచరిస్తున్నాయి. ఇందులో మూడు విద్యుత్ షాక్, ఆరోగ్య కారణాల వల్ల చనిపోయాయి. దీంతో వాటి సంఖ్య ఐదుకు చేరింది. 2020లో ఈ ప్రాంతంలో ఆ గుంపులోనే ఉన్న ఏనుగు ఒక పిల్ల ఏనుగుకు జన్మనిచ్చింది. ప్రస్తుతం అదే ఏనుగుకు పుట్టిన పిల్ల ఏనుగుతో కలిపి వాటి సంఖ్య ఏడుకు చేరింది. కొంత కాలంగా గజరాజులు ఈ ప్రాంతంలో తిరుగుతూ పంటలు, ఆస్తులను ధ్వంసం చేస్తున్నాయి. వాటివల్లఇప్పటివరకూ ఏడుగురు మృతి చెందారు. ఎనిమిది మూగజీవాలు కూడా మృత్యువాతపడ్డాయి. ఎంతోమంది గాయాలపాలయ్యారు. నిత్యం ఏదోఒకచోట ఏనుగులు సంచరిస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేసున్నాయి. అయినా వాటిని తరలించేందుకు ప్రభుత్వం, అటవీశాఖ అధికారులు శాశ్వత చర్యలు తీసుకోవడంలేదు.