పంద్రాగస్టు సందడి
ABN , First Publish Date - 2022-08-13T05:51:39+05:30 IST
పంద్రాగస్టు వేడుకల్లో భాగంగా జిల్లాలోని అన్ని పాఠశాలల్లో సందడి వాతావరణం నెలకొంది. శుక్రవారం అంతటా పలు క్రీడాపోటీలు నిర్వహించారు.
పాఠశాలల్లో క్రీడాపోటీలు
సత్తాచాటిన విద్యార్థులు
పార్వతీపురంటౌన్, ఆగస్టు 12: పంద్రాగస్టు వేడుకల్లో భాగంగా జిల్లాలోని అన్ని పాఠశాలల్లో సందడి వాతావరణం నెలకొంది. శుక్రవారం అంతటా పలు క్రీడాపోటీలు నిర్వహించారు. విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని తమ సత్తాచాటారు. జిల్లా కేంద్రంలోని ఆర్సీఎం బాలికల ఉన్నత పాఠశాల ఆవరణలో (ప్రస్తుతం వివిధ ప్రభుత్వ జిల్లా కార్యాలయాల సముదాయంలో) వాలీబాల్, ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల ఆవరణలో కబడ్డీ, అర్చరీ పోటీలు నిర్వహించారు. పట్టణ శివారు వెంకంపేటలోని ఓ మైదానంలో జరిగిన అఽథ్లెటిక్స్ పోటీలు హోరాహోరీగా సాగాయి. వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు ‘నువ్వా-నేనా’ అన్నట్లు పోటీల్లో పాల్గొన్నారు. జిల్లా క్రీడా ప్రాధికారిక సంస్థ అధికారి వెంకటేశ్వరరావు పర్యవేక్షణలో ఈ క్రీడాపోటీలను నిర్వహించారు.