రైతులను పట్టించుకోవడంలో విఫలం
ABN , First Publish Date - 2022-11-30T00:07:16+05:30 IST
రైతులను పట్టించుకోవడంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందని టీడీపీ రాష్ట్ర బీసీ సెల్ ఆర్గనైజర్ సెక్రటరీ వెన్నె సన్యాసినాయుడు తెలిపారు.
గుర్ల: రైతులను పట్టించుకోవడంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందని టీడీపీ రాష్ట్ర బీసీ సెల్ ఆర్గనైజర్ సెక్రటరీ వెన్నె సన్యాసినాయుడు తెలిపారు. మంగళవారం దేవునికణపాక గ్రామంలో బాదుడే బాదుడు కార్యక్ర మం నిర్వహించారు. ఈసందర్భంగా పార్టీ మండల అధ్యక్షుడు సీహెచ్ మహే శ్వరరావు మాట్లాడుతూ ఈ ప్రాంతంలో ఉన్న తోటపల్లి కాలువను పట్టించు కోవడంలో వైసీపీ నాయకులు పూర్తిగా విఫలమయ్యారన్నారు. కార్యక్రమంలో జిల్లా బీసీ సెల్ టీడీపీ నాయకుడు దాసరి శివప్రసాద్, కర్రోతు గోవిందు, గ్రామ మాజీ సర్పంచ్ శ్రీనివాస్, పార్టీ మండల ఉపాధ్యక్షుడు సూర్యనారా యణ, పి.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.