నేటి నుంచి జిల్లా స్థాయి క్రీడా, సాంస్కృతిక పోటీలు

ABN , First Publish Date - 2022-11-16T00:10:43+05:30 IST

గిరిజన విద్యార్థులకు ఈ నెల 16 నుంచి జిల్లా స్థాయి క్రీడా, సాంస్కృతిక పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా గిరిజన సంక్షేమశాఖ అధికారి బి.సూర్యనారాయణ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

 నేటి నుంచి జిల్లా స్థాయి క్రీడా, సాంస్కృతిక పోటీలు

పార్వతీపురం, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): గిరిజన విద్యార్థులకు ఈ నెల 16 నుంచి జిల్లా స్థాయి క్రీడా, సాంస్కృతిక పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా గిరిజన సంక్షేమశాఖ అధికారి బి.సూర్యనారాయణ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జన జాతీయ గౌరవ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాలల్లో ఒక రోజు పోటీలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ నెల 12న నాలుగు క్లస్టర్లలో పోటీలు నిర్వహించామన్నారు. ఇందులో ఎంపిక చేసిన సుమారు 400 మంది విజేతలు, ఉత్తమ క్రీడాకారులు జిల్లా పోటీల్లో పాల్గొంటారని చెప్పారు. వాలీబాల్‌, కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్‌, ఆర్చరీ, అథ్లెటిక్స్‌, వ్యాస రచన, వక్తృత్వ, డ్రాయింగ్‌, డ్యాన్స్‌, తదితర విభాగాల్లో పోటీలు జరుగుతాయని వెల్లడించారు. జిల్లా స్థాయిలో విజేతలుగా నిలిచిన వారు ఈ నెల 18 నుంచి 21వ తేదీ వరకు విశాఖపట్నంలో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని వివరించారు.

111111111111111

Updated Date - 2022-11-16T00:10:44+05:30 IST