టీడీపీ కార్యకర్తపై దాడి

ABN , First Publish Date - 2022-11-05T00:07:05+05:30 IST

శ్రీహరిపురంలో టీడీపీ కార్యకర్తపై వైసీపీ కార్యకర్తలు దాడి చేసిన ఘటన శుక్రవారం చోటుచేసుకుం ది.

టీడీపీ కార్యకర్తపై దాడి
గాయాలపాలైన టీడీపీ కార్యకర్త

వంగర: శ్రీహరిపురంలో టీడీపీ కార్యకర్తపై వైసీపీ కార్యకర్తలు దాడి చేసిన ఘటన శుక్రవారం చోటుచేసుకుం ది. వివరాల్లోకి వెళ్తే... ఏకాదశి పూజల్లో భాగంగా ఏటా నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలపై ఈ ఏడాది ఇరు వర్గాల మధ్య వివాదం నెలకొంది. అధికార పార్టీకి చెందిన కొంతమంది తామే నిర్వహిస్తామని చెప్పగా, ఎప్పటిలాగే అందరం కలిసి నిర్వహించుకుందామని టీడీపీ వర్గీయులు చెప్పగా, దీనికి వారు ససేమిరా అనడంతో వివాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో టీడీపీకి చెందిన బుగత లోకేష్‌పై కొంతమంది వైసీపీ కార్యకర్తలు రాళ్లతో దాడి చేశారు. దీంతో లోకేష్‌ తలకు బలమైన గాయమైంది. దీంతో ఇరువర్గాలు కొట్లాట కు సిద్ధమయ్యారు. ఇదే సమయంలో అటుగా సీఐ నవీన్‌ కుమార్‌ రావడంతో వారంతా పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న సీఐ ఇరువర్గాలను రామ మందిరం వద్దకు పిలిపించి కౌన్సిలింగ్‌ నిర్వహించారు. శాంతిభద్రతల దృష్ట్యా ఎటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించొద్దని, అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించి గ్రామంలో పోలీసు పికెట్‌ ఏర్పాటు చేశారు.

Updated Date - 2022-11-05T00:07:09+05:30 IST