ఆర్మీ ఉద్యోగి మృతి
ABN , First Publish Date - 2022-01-21T05:33:57+05:30 IST
మండలంలోని చినభీమవరం గ్రామానికి చెందిన సైనికోద్యోగి గొట్టాపు మురళి (37) బాత్రూం లో జారిపడి మృతిచెందారు.
బాడంగి, జనవరి 20: మండలంలోని చినభీమవరం గ్రామానికి చెందిన సైనికోద్యోగి గొట్టాపు మురళి (37) బాత్రూం లో జారిపడి మృతిచెందారు. ఈ సంఘటన గురువారం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు అందించిన సమాచారం మేరకు.. మురళి ఐటీబీపీ కాన్పూర్ 32 బెటాలియన్లో అవాల్దార్గా పని చేస్తున్నారు. ఈయన 2007లో విధుల్లో చేరారు. 2016లో బొబ్బిలి మండలం గొర్లె సీతారంపురం గ్రామానికి చెందిన యువతిని పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. ఆయన ఈనెల 13న సెలవుపెట్టి సంక్రాంతి పండగకు 14న తన స్వగ్రా మం చేరుకున్నారు. కుటుంబ సభ్యులతో సరదాగా గడిపారు. కాగా గురువారం బత్రూంలో కాలుజారిపడి అపస్మారక స్థితికి చేరుకున్నారు. దీంతో 108 సిబ్బందికి సమాచారం అందించగా సిబ్బంది వచ్చి మురళీని పరిశీలించి, మృతిచెందినట్టు ధ్రువీకరించారు. దీంతో కుటుంబ సభ్యులు ఒక్కసారిగా కన్నీరుమున్నీరుగా విల పించారు. ఈయన ఫిబ్రవరి 12 వరకు సెలవుపై వచ్చి కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుదామకున్న తరుణంలో ఈ దారుణం జరగడంతో కుటుంబ సభ్యులు కన్నీటి పర్యాంతమయ్యారు. అనంతరం బెటాలియన్ నుంచి ఇన్స్పెక్టర్ రోషన్లాల్తోపాటు 10 మంది సిబ్బంది వచ్చి మృతదేహంపై జాతీయ జెండాను నుంచి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం వేగావతి నది ఒడ్డున గాలిలోకి కాల్పు లు జరిపి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తిచేశారు.