అభివృద్ధికి అనుమతించండి

ABN , First Publish Date - 2022-12-09T23:56:06+05:30 IST

స్థానిక స్టేట్‌బ్యాంకు సెంటరులో గల భారతరాజ్యాంగ ని ర్మాత డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబే డ్కర్‌ విగ్రహం పరిసరాలు చాలా అపరిశుభ్రంగా ఉన్నందున మునిసి పాలిటీ అనుమతిని మంజూరు చేస్తే తన సొంత నిధులతో విగ్రహం చుట్టూ సర్వాంగసుందరంగా తీర్చిది ద్దుతానని టీడీపీ నియోజకవర్గ ఇన్‌ చార్జి బేబీనాయన అన్నారు.

అభివృద్ధికి అనుమతించండి

బొబ్బిలి: స్థానిక స్టేట్‌బ్యాంకు సెంటరులో గల భారతరాజ్యాంగ ని ర్మాత డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబే డ్కర్‌ విగ్రహం పరిసరాలు చాలా అపరిశుభ్రంగా ఉన్నందున మునిసి పాలిటీ అనుమతిని మంజూరు చేస్తే తన సొంత నిధులతో విగ్రహం చుట్టూ సర్వాంగసుందరంగా తీర్చిది ద్దుతానని టీడీపీ నియోజకవర్గ ఇన్‌ చార్జి బేబీనాయన అన్నారు. ఈ మేరకు తమకు అనుమతి ఇవ్వాలని కోరుతూ బేబీనా యన రాసిన లేఖను టీడీపీ నాయకులు శుక్రవారం స్థానిక మునిసిపల్‌ కమీషనరు సత్తారు శ్రీనివాసరావుకు అందజేశారు. అంబేడ్కర్‌ సెంటరు బొబ్బిలి పట్టణానికి ల్యాండ్‌మార్కుగా మారినందున, ఆ మహనీయునికి మరింత గౌరవ ప్రపత్తులు కలి గించేలా ఈ ప్రాంతాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు. టీడీపీ నాయకులు, మున్సిపల్‌ కౌన్సిలర్లు రౌతు రామ్మూర్తినాయుడు, సుంకరి సాయిరమేష్‌, వెలగాడ హైమావతి, బొత్స అప్పులు, కాకల వెంకటరావు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-09T23:56:08+05:30 IST