ఏలూరు ఎంవీఐ ఇంట్లో ఏసీబీ సోదాలు

ABN , First Publish Date - 2022-12-30T03:03:41+05:30 IST

ఏలూరుజిల్లా రవాణా శాఖ కార్యాలయంలో మోటారు వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న ఎర్లపాటి మృత్యుంజయరాజు ఇంట్లో ఏసీబీ సెంట్రల్‌ ఇన్వెస్టిగేషన్‌ యూనిట్‌ సభ్యులు గురువారం సోదా లు నిర్వహించారు.

ఏలూరు ఎంవీఐ ఇంట్లో ఏసీబీ సోదాలు

రూ.3.84 కోట్ల ఆస్తులు గుర్తింపు

విజయవాడ, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): ఏలూరుజిల్లా రవాణా శాఖ కార్యాలయంలో మోటారు వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న ఎర్లపాటి మృత్యుంజయరాజు ఇంట్లో ఏసీబీ సెంట్రల్‌ ఇన్వెస్టిగేషన్‌ యూనిట్‌ సభ్యులు గురువారం సోదా లు నిర్వహించారు. కృష్ణాజిల్లా పమిడిముక్కల మండలం మంటాడ గ్రామానికి చెందిన మృత్యుంజయరాజు ఆదాయానికి మించిన ఆస్తులు గడించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఏసీబీ సీఐయూ బృందాలు రంగంలోకి దిగి.. విజయవాడ నివాసంలో గురువారం సోదాలు నిర్వహించాయి. విజయవాడ నగరంలో ఇళ్లు, మంటాడ గ్రామంలో 7.48 ఎకరాల వ్యవసాయభూమి ఉన్నట్టు గుర్తించి... ఈ మొత్తం ఆస్తుల మార్కెట్‌ విలువ రూ.3.84 కోట్లుగా లెక్క తేల్చాయి.

Updated Date - 2022-12-30T03:03:42+05:30 IST