నేటి నుంచి రాష్ట్ర స్థాయి యోగా పోటీలు
ABN , First Publish Date - 2022-11-12T01:12:31+05:30 IST
రాష్ట్ర యోగా అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 12 నుంచి రెండు రోజుల పాటు రాష్ట్ర స్థాయి యోగా పోటీలు ప్రారంభం కానున్నట్టు ఏపీ యోగా అసోసియేషన్ జాయింట్ సెక్రెటరీ పుల్లేటి సతీష్ తెలిపారు.
చోడవరం, నవంబరు 11: రాష్ట్ర యోగా అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 12 నుంచి రెండు రోజుల పాటు రాష్ట్ర స్థాయి యోగా పోటీలు ప్రారంభం కానున్నట్టు ఏపీ యోగా అసోసియేషన్ జాయింట్ సెక్రెటరీ పుల్లేటి సతీష్ తెలిపారు. స్థానిక ఉషోదయ కళాశాల ప్రాంగణంలో నిర్వహిస్తున్న ఈ పోటీలలో 8 నుంచి 80 ఏళ్ల కేటగిరీ వరకూ పోటీలు ఉంటాయన్నారు. ఈ పోటీలలో విజేతలకు వచ్చే నెల 26నుంచి 28వ తేదీల్లో పాండిచ్చేరిలో జరగనున్న జాతీయ స్థాయి యోగా పోటీలలో పాల్గొంటారన్నారు. ఈ పోటీలకు రాష్ట్రం నలుమూలల నుంచి 500 మంది క్రీడాకారులు హాజరుకానున్నారని, వారందరికీ అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఉషోదయ విద్యాసంస్థల చైర్మన్ జె. రమణాజీ, పతంజలి యోగ కేంద్రం గౌరవాధ్యక్షుడు పప్పల రమణమూర్తి, పసుమర్తి అశోక్ పాల్గొన్నారు.