YCP vs TDP: విశాఖ: వైసీపీ వర్సెస్ టీడీపీ
ABN , First Publish Date - 2022-07-28T19:25:40+05:30 IST
విశాఖలోని శంకుస్థాపన కార్యక్రమంలో వైసీపీ, టీడీపీ నేతల మధ్య ప్రోటోకాల్ రగడ నెలకొంది.
విశాఖ (Visakha): 26వ వార్డులో కోటి యాభై మూడు లక్షల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనుల (development work) శంకుస్థాపన కార్యక్రమంలో వైసీపీ (YCP), టీడీపీ (TDP) నేతల మధ్య ప్రోటోకాల్ (protocol) రగడ నెలకొంది. ఇరువర్గాల నేతల మధ్య తోపులాట జరిగింది. దీంతో ఇరుపార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు సంఘటన ప్రదేశానికి భారీగా చేరుకున్నారు. ఈ నేపథ్యంలో శంకుస్థాపన స్థలం వద్ద ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడడంతో పోలీసులు చేరుకున్నారు. ప్రోటోకాల్ పాటించకుండా శంకుస్థాపన ఎలా చేస్తారంటూ స్థానిక టీడీపీ కార్పొరేటర్ (Corporator) ముక్కా శ్రావణి ప్రశ్నించారు. వైసీపీ నేతల అనుచిత ప్రవర్తనపై టీడీపీ ప్లోర్ లీడర్ పీలా శ్రీనివాస్ మండిపడ్డారు. వైసీపీ నేతలు, అధికారుల తీరుపై కలెక్టర్కు పిర్యాదు చేస్తామని టీడీపీ నేతలు అన్నారు.