వీఆర్‌ఏల వేతనం రూ.21 వేలకు పెంచాలి

ABN , First Publish Date - 2022-03-03T06:29:40+05:30 IST

వీఆర్‌ఏల వేతనం రూ.21 వేలకు పెంచాలి

వీఆర్‌ఏల వేతనం రూ.21 వేలకు పెంచాలి
ర్యాలీ నిర్వహిస్తున్న వీఆర్‌ఏలు

సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఆర్‌.శంకరరావు డిమాండ్‌

పాడేరులో నిరసన ర్యాలీ

పాడేరు, మార్చి 2: గ్రామ రెవెన్యూ సహాయకులకు (వీఆర్‌ ఏలు) నెలకు రూ.21 వేలు వేతనం ఇవ్వాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఆర్‌.శంకరరావు డిమాండ్‌ చేశారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వీఆర్‌ఏలు బుధవారం ఎంపీడీవో కార్యాలయం నుంచి సబ్‌కలెక్టర్‌ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా శంకరరావు మాట్లాడుతూ, నిబద్ధతతో కష్టపడి విధులు నిర్వహిస్తున్న వీఆర్‌ఏల పట్ల ప్రభుత్వం వివక్ష చూపుతున్నదని, వారి సమస్యల పరిష్కారానికి కనీస శ్రద్ధ చూపకపోవడం శోచనీయమని అన్నారు. వేతనం రూ.21 వేలకు పెంచడంతోపాటు టీఏ, డీఏలు ఇవ్వాలని, అర్హులైన వారికి పదోన్నతులు కల్పించాలని డిమాండ్‌ చేశారు. అనంతరం సబ్‌కలెక్టర్‌ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో వీఆర్‌ఏల డివిజన్‌ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు శేఖర్‌, కొండబాబు, సభ్యులు సింహాచలం, మోహన్‌, నీలకంఠం, తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-03-03T06:29:40+05:30 IST