MVV Satyanarayana: విశాఖ గర్జనకు వైసీపీకి సంబంధంలేదు

ABN , First Publish Date - 2022-10-14T18:30:16+05:30 IST

విశాఖ గర్జనకు వైసీపీకి సంబంధంలేదని.. గర్జనను జేఏసీ నిర్వహిస్తోందని ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ స్పష్టం చేశారు.

MVV Satyanarayana: విశాఖ గర్జనకు వైసీపీకి సంబంధంలేదు

విశాఖపట్నం: విశాఖ గర్జనకు వైసీపీ(YCP)కి సంబంధంలేదని.. గర్జనను జేఏసీ నిర్వహిస్తోందని ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ (MVV Satyanarayana) స్పష్టం చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ (Pawan kalyan) ఉత్తరాంధ్రకు ఎందుకు వస్తున్నారో తనకు తెలియదన్నారు. ‘‘ఆయన కార్యక్రమం వేరు... మా కార్యక్రమం వేరు. ఆయన ఆరు నెలలకు ఒక్కసారి కనిపిస్తారు.. మళ్లీ వెళ్ళిపోతారు’’ అని వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలని సీఎం జగన్ (YS Jagan mohan reddy) వికేంద్రీకరణ బిల్లును అసెంబ్లీలో పెట్టారని తెలిపారు. కొంతమంది అసెంబ్లీలో బిల్లును అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. జేఏసీ ఆధ్వర్యంలో రేపు విశాఖ గర్జన నిర్వహిస్తున్నారని ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ (Visakha MP) పేర్కొన్నారు. 

Updated Date - 2022-10-14T18:30:16+05:30 IST