Visakhapatnamలో గ్యాంగ్ రేప్
ABN , First Publish Date - 2022-07-02T13:37:37+05:30 IST
రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు కొనసాగుతున్నాయి.
విశాఖపట్నం: రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. మానసిక దివ్యాంగురాలు అన్న కనికరం లేకుండా పైశాచికానికి పాల్పడ్డాడు కామాంధులు. నగరంలో మానసిక దివ్యాంగురాలపై ముగ్గురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితులకు ఓ మహిళ సహకరించినట్లు పోలీసులు తెలిపారు. వెంటనే కుటుంబసభ్యులు బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.