Visakhaలో రోడ్డు ప్రమాదం... ఇద్దరు మృతి
ABN , First Publish Date - 2022-02-09T13:30:07+05:30 IST
నగరంలోని తగరపువలస సమీపంలో జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు.
విశాఖపట్నం: నగరంలోని తగరపువలస సమీపంలో జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. ఆగి ఉన్న లారీని బైక్ ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.