అప్పన్నను దర్శించుకున్న కేంద్ర మంత్రి రామేశ్వర్ తేలి
ABN , First Publish Date - 2022-01-22T05:13:22+05:30 IST
కేంద్ర కార్మిక, ఉపాధి, పెట్రోలియం, సహజ వాయు శాఖామాత్యులు రామేశ్వర్ తేలి శుక్రవారం సాయంత్రం సింహాచలం వరాహ లక్ష్మీనృసింహస్వామిని దర్శించుకున్నారు.

విశాఖపట్నం, జనవరి 21: కేంద్ర కార్మిక, ఉపాధి, పెట్రోలియం, సహజ వాయు శాఖామాత్యులు రామేశ్వర్ తేలి శుక్రవారం సాయంత్రం సింహాచలం వరాహ లక్ష్మీనృసింహస్వామిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు అధికార లాంచనాలతో ఆహ్వానం పలికారు. బేడా మండప ప్రదక్షిణ చేసిన మంత్రి గోత్రనామాలతో అర్చకులు పూజలు చేసి శేషవస్త్రాన్ని పర్యవేట్టంగా చుట్టారు. గోదాదేవి అమ్మవారి దర్శనం అనంతరం పండితులు వేదాశీర్వచనాలను, ఏఈఓ ఎన్.ఆనందకుమార్ ప్రసాదాలను అందజేశారు.