180 కిలోల గంజాయితో ఇద్దరి అరెస్టు
ABN , First Publish Date - 2022-05-22T06:35:16+05:30 IST
అరకులోయ ఘాట్రోడ్డులో శనివారం 180 కిలోల గంజాయిని తరలిస్తున్న ఇద్దరిని అరెస్టు చేసి, రిమాండ్కు తరలించినట్టు ఎన్ఫోర్స్మెంట్ సీఐ గణపతిబాబు తెలిపారు.
అరకులోయ, మే 21: అరకులోయ ఘాట్రోడ్డులో శనివారం 180 కిలోల గంజాయిని తరలిస్తున్న ఇద్దరిని అరెస్టు చేసి, రిమాండ్కు తరలించినట్టు ఎన్ఫోర్స్మెంట్ సీఐ గణపతిబాబు తెలిపారు. ముందస్తు సమాచారం మేరకు అనంతగిరి-అరకులోయ ఘాట్రోడ్డులో కాపుకాచి గంజాయి తరలిస్తున్న కారును డముకు వద్ద పట్టుకున్నామన్నారు. అందులో అక్రమంగా తరలిస్తున్న 180 కిలోల గంజాయిని గుర్తించి, జి.మాడుగుల మండలం మద్దిగరువు గ్రామానికి చెందిన వెంకటరామ గురుప్రభు, కొఠారి ఈశ్వరరావులను అరెస్టు చేశామన్నారు. ఈ దాడిలో ఎస్ఐ రామారావు, ఏఎస్ఐ వీర్రాజు పాల్గొన్నారని ఆయన వివరించారు.