ముగిసిన పౌరరక్షణ వలంటీర్ల శిక్షణ
ABN , First Publish Date - 2022-12-07T01:22:54+05:30 IST
ప్రకృతి విపత్కరమైన ప్రమాదాలు సంభవించినపుడు సహాయక చర్యలు అందించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని జీవీఎంసీ కమీషనర్ పి.రాజాబాబు పేర్కొన్నారు.
సీతంపేట, డిసెంబరు 6: ప్రకృతి విపత్కరమైన ప్రమాదాలు సంభవించినపుడు సహాయక చర్యలు అందించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని జీవీఎంసీ కమీషనర్ పి.రాజాబాబు పేర్కొన్నారు. గురుద్వార కూడలి శాంతిపురంలో గల పౌర రక్షణ సంస్థ ఆధ్వర్యంలో 226వ బ్యాచ్ శిక్షణ ముగింపు కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిఽథిగా విచ్చేసిన జీవీఎంసీ కమిషనర్ మాట్లాడుతూ వలంటీర్లను అభినందించారు. ఈ సందర్భంగా వలంటీర్లు తాము శిక్షణ పొందిన అంశాలను ప్రదర్శించారు. ప్రకృతి విపత్కర సమయంలో ఎలా మెలగాలి, అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు పై అంతస్తు నుంచి క్షతగాత్రులను ఏవిధంగా సురక్షితంగా కిందికి తీసుకురావాలి, క్షతగ్రతులకు ప్రథమ చికిత్స తదితర అంశాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో ఉప పౌర రక్షణ అధికారి కె.భవాని, ప్రత్యేక ఉప కలెక్టర్ విజయలక్ష్మి, శిక్షకులు శ్రీనివాస రాజమణి, డాక్టర్ పి.రామారావు, వైద్య, ఆగ్నిమాపక, పోలీసు కమ్యూనికేషన్ శాఖ, సివిల్ డిఫెన్స్ సిబ్బంది పాల్గొన్నారు.