రెండు ఇళ్లల్లో చొరబడ్డ దొంగలు
ABN , First Publish Date - 2022-05-21T06:51:54+05:30 IST
మండలంలోని అడ్డరోడ్డు తిమ్మాపురం గ్రామంలో గురువారం అర్ధరాత్రి రెండు ఇళ్లల్లో చోరీలు జరిగాయి.
ఆరున్నర తులాల బంగారం, రూ.2 లక్షల నగదు అపహరణ
ఎస్.రాయవరం, మే 20: మండలంలోని అడ్డరోడ్డు తిమ్మాపురం గ్రామంలో గురువారం అర్ధరాత్రి రెండు ఇళ్లల్లో చోరీలు జరిగాయి. పక్కపక్కనే ఉన్న బదిరెడ్డి లోవరాజు, సయ్యద్ బాషాల ఇళ్లల్లోకి దొంగలు చొరబడి ఆరున్నర తులాల బంగారం, రూ.2 లక్షల నగదు అపహరిం చారు. ఎస్ఐ శ్రీనివాస్ అందిం చిన వివరాల ప్రకారం... బదిరెడ్డి లోవరాజు తన భార్య లావణ్య, కుమార్తె సాత్వికతో కలిసి ఈ నెల 17న అత్తగారి ఇల్లు హైదరాబాద్ వెళ్లారు. ఇంటిలో ఎవరూ లేకపోవడంతో గురువారం అర్ధ రాత్రి దొంగలు లోవరాజు ఇల్లు కిటికీ ఊచలను వంచి లోపలకు చొరబడ్డారు. బీరువాలో ఉన్న ఐదు తులాల బంగారు ఆభరణాలతో పాటు రూ.1.5 లక్షల నగదును అపహరించారు. పక్క ఇంటి వారు శుక్రవారం ఉదయం కిటికీ ఊచలు వంచి ఉండడంతో అనుమానంతో లోపల చూడగా చోరీ జరిగినట్టు గుర్తించారు. అలాగే ఆ పక్కనే ఉన్న సయ్యద్ బాషా ఇంటిలో కూడా ఎవరు లేకపోవడంతో తలుపు గొళ్లెం బద్దలుగొట్టి ఇంటిలో ఉన్న తులంన్నర బంగారు వస్తువులతో పాటు రూ.50 నగదును దొంగలు చోరీ చేశారు. విషయం తెలుసుకున్న అడిషనల్ (క్రైమ్) ఎస్పీ లక్ష్మీనారాయణ, సీఐ నారాయణ రావు, ఎస్ఐ శ్రీనివాస్ వెళ్లి పరిశీలించారు. అలాగే క్లూస్ టీం చేరుకుని ఆధారాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు.