తెలుగుదేశం పార్టీ శ్రేణుల కొవ్వొత్తుల ర్యాలీ

ABN , First Publish Date - 2022-05-23T05:17:33+05:30 IST

కాకినాడలో దళిత యువకుడు సుబ్రహ్మణ్యం హత్యను నిరసిస్తూ దక్షిణ నియోజకవర్గం పార్టీఇన్‌చార్జి గండిబాబ్జీ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ఆదివారం టీడీపీ జిల్లా కార్యాలయం నుంచి కొవ్వొత్తులు వెలిగించి నిరసన ర్యాలీ నిర్వహించారు.

తెలుగుదేశం పార్టీ శ్రేణుల కొవ్వొత్తుల ర్యాలీ
గండిబాబ్జీ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహిస్తున్న టీడీపీ శ్రేణులు

కాకినాడలో దళిత యువకుడి హత్యకు నిరసన

నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్‌

విశాఖపట్నం, మే 22: కాకినాడలో దళిత యువకుడు సుబ్రహ్మణ్యం హత్యను నిరసిస్తూ దక్షిణ నియోజకవర్గం పార్టీఇన్‌చార్జి గండిబాబ్జీ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ఆదివారం  టీడీపీ జిల్లా కార్యాలయం నుంచి కొవ్వొత్తులు వెలిగించి నిరసన  ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా గండిబాబ్జీ మాట్లాడుతూ హత్యారోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ అనంతబాబు ఇప్పటికీ దర్జాగా తిరుగుతూ వివాహాది శుభ కార్యక్రమాలకు హాజరవుతున్నారంటే పోలీసుల తీరు ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. ఇప్పటి కైనా అతన్ని అరెస్టు చేసి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. కాగా,  పార్టీ కార్యాలయం వద్ద పోలీసులు పెద్దఎత్తున మోహరించడం గమనార్హం. 

Updated Date - 2022-05-23T05:17:33+05:30 IST