పీఆర్సీ జీవోలపై టీచర్ల ఆందోళన
ABN , First Publish Date - 2022-01-19T05:50:38+05:30 IST
ఉద్యోగులకు ఎటువంటి ప్రయోజనం లేని పీఆర్సీ జీవోలను రద్దు చేయాలని, మెరుగైన ఫిట్మెంట్ ఇవ్వాలని ఫ్యాప్టో నేత ఎ.శ్యామ్సుందర్ డిమాండ్ చేశారు.
పాడేరు, జనవరి 18: ఉద్యోగులకు ఎటువంటి ప్రయోజనం లేని పీఆర్సీ జీవోలను రద్దు చేయాలని, మెరుగైన ఫిట్మెంట్ ఇవ్వాలని ఫ్యాప్టో నేత ఎ.శ్యామ్సుందర్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇచ్చిన పీఆర్సీ జీవోలకు వ్యతిరేకంగా మంగళవారం సాయంత్రం స్థానిక అంబేడ్కర్ కూడలి వద్ద ఫ్యాప్టో ఆధ్వర్యంలో టీచర్లు నిరసన చేపట్టారు. అందులో భాగంగా ప్రభుత్వం తాజాగా జారీ చేసిన పీఆర్సీ జీవో కాపీల ప్రతులను దహనం చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ఇచ్చిన పీఆర్సీ జీవోలపై ఉద్యోగులు సంతృప్తిగా లేరని, ఐఆర్ కంటే ఫిట్మెంట్ ఎక్కువగా ఇవ్వాలని, హెచ్ఆర్ఏలో కోత విధించవద్దని, ఉద్యోగుల జీతాలు పెరిగేలా పీఆర్సీ ఉండాలని శ్యామ్సుందర్ డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో ఏపీటీఎఫ్ నేతలు బట్టి చిన్నారావు, మొస్య సత్యారావు, ప్రభాకర్, పోతురాజు, కొండబాబు, సూర్యకుమారి, దొర, కూర్యారావు, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఆర్.శంకరరావు, ఏపీ ఎన్జీవో డివిజన్ కార్యదర్శి సంజీవరాజు, యూటీఎఫ్ నేత నాగేశ్వరరావు పాల్గొన్నారు.