ఆర్టీసీ చార్జీల పెంపుపై నిరసనను విజయవంతం చేయండి
ABN , First Publish Date - 2022-07-02T06:28:19+05:30 IST
ఆర్టీసీ చార్జీల పెంపుని నిరసిస్తూ శనివారం ఘాట్ రోడ్డు జంక్షన్లో చేపట్టనున్న కార్యక్రమాన్ని టీడీపీ నాయకులు, కార్యకర్తలు విజయవంతం చేయాలని టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి పీవీజీ కుమార్ కోరారు.
టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి పీవీజీ కుమార్
మాడుగుల రూరల్, జూలై 1: ఆర్టీసీ చార్జీల పెంపుని నిరసిస్తూ శనివారం ఘాట్ రోడ్డు జంక్షన్లో చేపట్టనున్న కార్యక్రమాన్ని టీడీపీ నాయకులు, కార్యకర్తలు విజయవంతం చేయాలని టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి పీవీజీ కుమార్ కోరారు. శుక్రవారం గాదిరాయిలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలను కలుసుకుని కార్యక్రమంపై చర్చించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ.. అసలే అన్ని ధరలు పెరిగి ప్రజలు ఇబ్బం దులు ఎదుర్కొంటున్నారని, దీనికి తోడు ఆర్టీసీ బస్సు చార్జీలను ప్రభుత్వం పెంచి మరింత ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు అద్దిపల్లి జగ్గారావు, ఉండూరు దేముడు, పెంటకోట జగన్నాథ రావు, అప్పలనాయుడు, శ్రీరామ్మూర్తి, అప్పారావు, తదితరులు పాల్గొన్నారు.