రాష్ట్ర స్థాయి మహిళల ఫుట్‌బాల్‌ టోర్నీ ప్రారంభం

ABN , First Publish Date - 2022-05-28T05:01:50+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌ ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి జూనియర్‌ మహిళల ఫుట్‌బాల్‌ చాంపియన్‌ షిప్‌ టోర్నీ శుక్రవారం ప్రారంభమైంది.

రాష్ట్ర స్థాయి మహిళల ఫుట్‌బాల్‌ టోర్నీ ప్రారంభం
తలపడుతున్న కర్నూలు, విశాఖ జట్లు

తొలిరోజు మ్యాచ్‌ల్లో ఆతిథ్య విశాఖ జట్టు ఓటమి

విశాఖపట్నం (స్పోర్ట్సు), మే 27: ఆంధ్రప్రదేశ్‌ ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి జూనియర్‌ మహిళల ఫుట్‌బాల్‌ చాంపియన్‌ షిప్‌ టోర్నీ శుక్రవారం ప్రారంభమైంది. పోర్టు స్టేడియంలో జరుగుతున్న ఈ పోటీలను ఫుట్‌బాల్‌ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొసరాజు గోపాలకృష్ణ ప్రారంభించి క్రీడాకారిణులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఫుట్‌బాల్‌ సంఘం ప్రతినిధులు ఎ.జగన్నాథరావు తదితరులు పాల్గొన్నారు. తొలిరోజు మ్యాచ్‌ల్లో ఆతిథ్య విశాఖ జట్టు ఓడిపోయింది.


తొలిరోజు ఫలితాలు:

తొలి మ్యాచ్‌లో కడప 11-0 గోల్స్‌ తేడాతో కృష్ణాపై ఘన విజయం సాధించింది. రెండో మ్యాచ్‌లో చిత్తూరు 4-1 గోల్స్‌ తేడాతో పశ్చిమ గోదావరిపై గెలుపొందింది. మరో మ్యాచ్‌లో కర్నూలు 4-0 గోల్స్‌ తేడాతో విశాఖపై విజయం సాధించింది.


Updated Date - 2022-05-28T05:01:50+05:30 IST