రాష్ట్ర స్థాయి హాకీ పోటీలు ప్రారంభం
ABN , First Publish Date - 2022-01-24T06:33:54+05:30 IST
పట్టణంలోని రాజీవ్ గాంధీ క్రీడా మైదానంలో 12వ రాష్ట్రస్థాయి జూనియర్ మెన్స్ హాకీ పోటీలు ఆదివారం ప్రారంభమ య్యాయి.
13 జిల్లాల నుంచి జట్లు హాజరు
మూడు రోజుల పాటు నాకౌట్ కమ్ లీగ్ తరహాలో నిర్వహణ
ఎలమంచిలి, జనవరి 23 : పట్టణంలోని రాజీవ్ గాంధీ క్రీడా మైదానంలో 12వ రాష్ట్రస్థాయి జూనియర్ మెన్స్ హాకీ పోటీలు ఆదివారం ప్రారంభమ య్యాయి. పోటీలను ఎంపీపీ బోదెపు గోవింద్ ప్రారం భించి మాట్లాడుతూ జాతీయస్థాయి హాకీ క్రీడలో ఎల మంచిలికి ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. ఈ పోటీల్లో తలపడేవారు భారత్ జట్టులో చోటు సాధించడమే లక్ష్యంగా ప్రతిభ చూపాలని ఆకాంక్షించారు. నాకౌట్ కమ్ లీగ్ తరహాలో జరగనున్న ఈ పోటీలకు రాష్ట్రం లోని పదమూడు జిల్లాల నుంచి 13 జట్లు విచ్చేశాయి. అనంతరం ఉత్సాహభరితంగా పోటీలు సాగాయి. ఎలమంచిలి హాకీ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు జీవీ రెడ్డి, కొఠారు నరేష్ల ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ పోటీల్లో మునిసిపల్ వైస్ చైర్మన్ అర్రెపు గుప్తా, వైసీపీ నాయకుడు బొద్దపు యర్రయ్యదొర, జిల్లా హాకీ అసోసియేషన్ ప్రతినిధి హర్షవర్ధన్, కౌన్సిలర్లు, నాయ కులు పిట్టా సత్తిబాబు, కొండబాబు, దూది నరసింహ మూర్తి, పిళ్లా త్రినాథ్, చాగంటి రాజు, గణేశ్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు.