నారా లోకేశ్‌కు ఘన స్వాగతం

ABN , First Publish Date - 2022-05-21T06:38:08+05:30 IST

విజయనగరం జిల్లా రాజాంలో పార్టీ నాయకుడి ఇంట్లో వివాహానికి హాజరయ్యేందుకు వచ్చిన తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు ఎయిర్‌పోర్టులో నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.

నారా లోకేశ్‌కు ఘన స్వాగతం
లోకేశ్‌తో సెల్ఫీ తీసుకుంటున్న మహిళలు, కార్యకర్తలు

విశాఖపట్నం/గోపాలపట్నం, మే 20(ఆంధ్రజ్యోతి): విజయనగరం జిల్లా రాజాంలో పార్టీ నాయకుడి ఇంట్లో వివాహానికి హాజరయ్యేందుకు వచ్చిన తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు ఎయిర్‌పోర్టులో నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. హైదరాబాద్‌ నుంచి శుక్రవారం మధ్యాహ్నం వచ్చిన లోకేశ్‌ను పార్టీ నేతలు ఎయిర్‌పోర్టులోని వీఐపీ లాంజ్‌లో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా విశాఖపట్నం పార్లమెంటరీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పల్లా శ్రీనివాసరావు, పాశర్ల ప్రసాద్‌లు సంపంగి పూలమాల వేసి, వరాహనృసింహస్వామి చిత్రపటాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పార్టీ నేతలను ఆయన పలకరించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. లోకేశ్‌కు లాంజ్‌లో స్వాగతం పలికిన వారిలో మాజీ మంత్రులు బండారు సత్యనారాయణమూర్తి, కోండ్రు మురళీమోహన్‌, ఎమ్మెల్యేలు పి.గణబాబు, వెలగపూడి రామకృష్ణబాబు, మాజీ ఎమ్మెల్యేలు గండి బాబ్జీ, గవిరెడ్డి రామానాయుడు, అనకాపల్లి పార్లమెంటరీ అధ్యక్షుడు బుద్ద నాగజగదీశ్వరరావు, భీమిలి, ఎలమంచిలి, చోడవరం, మాడుగుల, విశాఖ ఉత్తర ఇన్‌చార్జిలు కోరాడ రాజబాబు, ప్రగడ నాగేశ్వరరావు, బత్తుల తాతయ్యబాబు, పీవీజీ కుమార్‌, చిక్కాల విజయ్‌, లాలం భాస్కరరావు, ఆదిరెడ్డి వాసు, సత్యవతి, పుచ్ఛా విజయకుమార్‌, హర్షవర్దన్‌ తదితరులు ఉన్నారు. ఎయిర్‌పోర్టు లోపల నుంచి బయటకు వచ్చినపుడు ఎగ్జిట్‌ గేటు వద్ద లోకేశ్‌కు స్వాగతం పలకడానికి నాయకులు, కార్యకర్తలు పోటీ పడ్డారు. తెలుగు మహిళలు అనంతలక్ష్మి, సుజాత తదితరులు లోకేశ్‌కు బొట్టుపెట్టి హారతి ఇచ్చారు. బయట స్వాగతం పలికిన వారిలో పార్టీ నాయకులు మహ్మద్‌ నజీర్‌, మూర్తి యూదవ్‌, లొడగల కృష్ణ, గాడు చిన్నకుమారి లక్ష్మి, ప్రణవ్‌గోపాల్‌, కాళ్ల శంకర్‌, తాతాజి, మొల్లి పెంటిరాజు, మొల్లేటి కుమారస్వామి, పోలారావు, ముత్యాల నాయుడు, రతన్‌రాజు, సతీశ్‌ తదితరులు ఉన్నారు. 


Updated Date - 2022-05-21T06:38:08+05:30 IST