శారదా నది పరవళ్లు
ABN , First Publish Date - 2022-08-10T06:13:10+05:30 IST
మండలంలోని రైవాడ జలాశయం నుంచి రెండు గేట్లు ద్వారా వరద నీటిని విడిచిపెట్టడంతో శారదా నది పరవళ్లు తొక్కుతున్నది.
దేవరాపల్లి, ఆగస్టు 9: మండలంలోని రైవాడ జలాశయం నుంచి రెండు గేట్లు ద్వారా వరద నీటిని విడిచిపెట్టడంతో శారదా నది పరవళ్లు తొక్కుతున్నది. జలాశయం గరిష్ఠ నీటిమట్టం 114 మీటర్లు కాగా, మంగళవారానికి 113.40 మీటర్లకు చేరింది. జలాశయంలోకి వరద నీరు 1,100 క్యూసెక్కులు చేరుతుండగా, రెండు గేట్లు ద్వారా 1,200 క్యూసెక్కుల వరద నీరు శారదా నదిలో విడిచి పెడుతున్నారు. దీంతో నది పరవళ్లు తొక్కుతూ ఉధృతంగా ప్రవహిస్తున్నది.