ఏజెన్సీలో రెడ్క్రాస్ సేవలు విస్తరించాలి
ABN , First Publish Date - 2022-05-22T06:44:41+05:30 IST
గిరిజన ప్రాంతంలో రెడ్క్రాస్ సేవలను విస్తరించాలని జిల్లా కలెక్టర్ సుమిత్కుమార్ అన్నారు. శనివారం ఐటీడీఏ ఆవరణలో రెడ్క్రాస్ సొసైటీ అంబులెన్స్ను ఆయన ప్రారంభించారు.
జిల్లా కలెక్టర్ సుమిత్కుమార్
పాడేరు, మే 21(ఆంధ్రజ్యోతి): గిరిజన ప్రాంతంలో రెడ్క్రాస్ సేవలను విస్తరించాలని జిల్లా కలెక్టర్ సుమిత్కుమార్ అన్నారు. శనివారం ఐటీడీఏ ఆవరణలో రెడ్క్రాస్ సొసైటీ అంబులెన్స్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఏజెన్సీలో రెడ్క్రాస్ ద్వారా అధికంగా రక్తాన్ని సేకరించా లన్నారు. కార్యక్రమంలో ఐటీడీఏ పీవో గోపాలక్రిష్ణ, రెడ్క్రాస్ సొసైటీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జగన్మోహనరావు, విశాఖపట్నంజిల్లా అధ్యక్షుడు శివనాగేంద్రరెడ్డి, పాల్గొన్నారు.
రెడ్క్రాస్ సొసైటీ అల్లూరి జిల్లా కార్యవర్గం
జిల్లా రెడ్క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గాన్ని శనివారం ఎన్నుకున్నారు. సొసైటీ జిల్లా అధ్యక్షుడుగా జిల్లా కలెక్టర్ సుమిత్కుమార్ వ్యవహరించగా, గౌరవాధ్యక్షుడుగా కేవీఆర్కే.రాజు, ఉపాధ్యక్షుడుగా ఎస్.గంగరాజు, కార్యదర్శిగా జి.ఈశ్వరరావు, కోశాధికారిగా టి.అప్పారావునాయుడు, కార్యవర్గ సభ్యులుగా వి.జయలక్ష్మి, జి.గౌరీశంకరరావు, పి.సూర్యారావు, కె.లీలాప్రసాద్, ఎం.సూర్యనారాయణనాయుడు, వి.సత్యనారాయణ, జి.సుబ్రహ్మణ్యం,ఎస్.సంజీవరాజు, వి.లోహితాస్, కన్యాకుమారి, టి.స్వాతిని ఎన్నుకున్నారు.