AP: YCPలో మరోసారి బయటపడ్డ విభేదాలు
ABN , First Publish Date - 2022-06-01T18:14:54+05:30 IST
ఏపీ (AP)లో వైసీపీ (YCP)లో విభేదాలు మరోసారి బయటపడ్డాయి.
Pithapuram: ఏపీ (AP)లో వైసీపీ (YCP)లో విభేదాలు మరోసారి బయటపడ్డాయి. అధికార పార్టీలో వర్గపోరు మరోసారి తెరపైకి వచ్చింది. పిఠాపురం ఎమ్మెల్యే దొరబాబు (Dorababu) పై వైసీపీ అధికార ప్రతినిధి నారాయణ రెడ్డి (Narayana reddy) చేసిన వ్యాఖ్యలు తీవ్ర సంచలనంగా మారాయి. వైసీపీ మూడేళ్ల పాలనపై ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే దొరబాబుపై నారాయణ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఎమ్మెల్యే అవినీతిని ఎండగట్టారు. ఏ పని చేయాలన్నా దొరబాబుకు డబ్బులు ఇవ్వాలంటూ నారాయణ రెడ్డి ఆరోపించారు. ఇళ్ల స్థలాల కోసం లంచం అడిగారని.. ఇవ్వనందుకు ఇళ్ల స్థలాలు కేటాయించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నాగులపల్లి గ్రామాన్ని దత్తత తీసుకుంటానని చెప్పి ఎమ్మెల్యే దొరబాబు సవతి ప్రేమ చూపిస్తున్నారని నారాయణ రెడ్డి విమర్శించారు. ఎలాంటి సంక్షేమం అమలు చేయని దొరబాబు గడపగడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో ఇంటింటికి ఎలా వస్తారో చూస్తానంటూ సవాల్ విసిరారు.