రాష్ట్రంలో దిక్కుమాలిన పాలన: మధు

ABN , First Publish Date - 2022-11-25T03:56:49+05:30 IST

రాష్ట్రంలో దిక్కుమాలిన పాలన సాగుతోందని సీపీఎం రాష్ట్ర మాజీ కార్యదర్శి..

రాష్ట్రంలో దిక్కుమాలిన పాలన: మధు

నరసాపురం, నవంబరు 24: రాష్ట్రంలో దిక్కుమాలిన పాలన సాగుతోందని సీపీఎం రాష్ట్ర మాజీ కార్యదర్శి, మాజీ ఎంపీ మధు విమర్శించారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలోని మీరా గ్రంథాలయంలో గురువారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ‘‘జగన్‌ పాలనలో ఎంపీలు, ఎమ్మెల్యేలు అధికారంలేని బృందాలుగా మారారు. పాలన అంతా అస్తవ్యస్తంగా ఉంది. పోలీసుల దౌర్జన్యం పెరిగిపోయింది. రైతులు పండించిన పంటను పూర్తిగా కొనుగోలు చేసి, గిట్టుబాటు ధర కల్పించకపోతే రైతు పక్షాన ఉద్యమిస్తాం’’ అని మధు హెచ్చరించారు.

Updated Date - 2022-11-25T03:56:50+05:30 IST