పాడేరు-గెమ్మెలి బస్సు సర్వీసు ప్రారంభం
ABN , First Publish Date - 2022-01-22T06:28:07+05:30 IST
పాడేరు-గెమ్మెలి మధ్య ఆర్టీసీ బస్సు సర్వీసు నడపడం వల్ల గెమ్మెలి, వంజంగి, గడుతూరు, తాజంగి పంచాయతీల పరిధిలో వున్న సుమారు 80 గ్రామాలకు రవాణా కష్టాలు తొలగుతాయని ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి అన్నారు.

పలుగ్రామాలకు తీరనున్న రవాణా కష్టాలు
పాడేరు, జనవరి 21: పాడేరు-గెమ్మెలి మధ్య ఆర్టీసీ బస్సు సర్వీసు నడపడం వల్ల గెమ్మెలి, వంజంగి, గడుతూరు, తాజంగి పంచాయతీల పరిధిలో వున్న సుమారు 80 గ్రామాలకు రవాణా కష్టాలు తొలగుతాయని ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి అన్నారు. పీటీడీ అధికారులు నూతనంగా ప్రవేశపెట్టిన పాడేరు-గెమ్మెలి బస్సు సర్వీసును ఆమె శుక్రవారం ఇక్కడ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పీటీడీ డిపో మేనేజర్ ఆర్.ఎస్.నాయుడు, ఏపీ మెడికల్ కౌన్సిల్ సభ్యుడు డాక్టర్ టి.నరసింగరావు, ఏఎంసీ ఛైర్పర్సన్ మత్స్యరాస గాయత్రి, జి.మాడుగుల వైస్ ఎంపీపీ కుడుముల సత్యనారాయణ, వైసీపీ నేతలు పాల్గొన్నారు.