ఉరి వేసుకుని వివాహిత ఆత్మహత్య
ABN , First Publish Date - 2022-08-19T06:43:46+05:30 IST
పిల్లలు పుట్టలేదంటూ పెద్ద మావయ్య అంటున్న సూటిపోటి మాటలకు తాళలేక మనస్తాపంతో ఓ వివాహిత ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన పులగాలిపాలెంలో చోటుచేసుకుంది.
పెందుర్తి, ఆగస్టు 18: పిల్లలు పుట్టలేదంటూ పెద్ద మావయ్య అంటున్న సూటిపోటి మాటలకు తాళలేక మనస్తాపంతో ఓ వివాహిత ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన పులగాలిపాలెంలో చోటుచేసుకుంది. పెందుర్తి సీఐ అశోక్కుమార్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలం డ్రైవర్స్ కాలనీకి చెందిన పి.వెంకటేశ్వరరావుకు ఇద్దరు కుమారైలు విజయలక్ష్మి, లక్ష్మీదుర్గ. వీరిలో విజయలక్ష్మిని విశాఖకు చెందిన వీరాంజనేయులు కుమారుడు సతీశ్కు, లక్ష్మీదుర్గను వీరాంజనేయులు సోదరుడి కుమారుడు వెంకటేశ్కు ఇచ్చి వివాహం జరిపించారు. సతీశ్ సా్ఫ్ట్వేర్ ఉద్యోగి కాగా వెంకటేశ్ రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్లో అకౌంటెంట్. కొంతకాలం కిందిట ఇరువురు అక్కాచెల్లెళ్లు తమ భర్తల ఉద్యోగం రీత్యా హైదరాబాద్లో ఉన్నారు. అయితే ఆరు నెలల కిందట పులగాలిపాలెంలో వీరాంజనేయులు సొంతిల్లు నిర్మించుకోవడంతో విజయదుర్గతో పాటు లక్ష్మీదుర్గ పెద మావయ్య ఇంట్లోనే ఉంటుంది. కాగా వివాహం జరిగి ఐదేళ్లవుతున్నా లక్ష్మీదుర్గకు పిల్లలు పుట్టకపోవడంతో పెద్దమావయ్య వీరాంజనేయులు పలుమార్లు సూటిపోటి మాటలు అంటుండేవాడు. దీంతో మనస్తాపానికి గురైన లక్ష్మీదుర్గ గురువారం సాయంత్రం ఇంట్లోని పడక గదిలో సీలింగ్ ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పండింది. తన చెల్లి ఎంతసేపటికి తన గది తలుపులు తెరవకపోవడంతో విజయలక్ష్మి చుట్టుపక్కల వారి సాయంతో తలుపులు తెరిచి చూడగా ఉరి వేసుకుని కనిపించింది. మృతురాలి తండ్రి వెంకటేశ్వరరావు ఫిర్యాదు మేరకు ఎస్ఐ రాంబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.