సీపీఐ రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయండి
ABN , First Publish Date - 2022-07-01T06:24:05+05:30 IST
విశాఖ నగరంలో ఆగస్టు 26 నుంచి 28 వరకు మూడు రోజులపాటు జరగనున్న సీపీఐ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని పార్టీ జిల్లా కార్యదర్శి మరుపిళ్ల పైడి రాజు పిలుపు నిచ్చారు.
జిల్లా కార్యదర్శి మరుపిళ్ల పైడిరాజు
విశాఖపట్నం, జూన్ 30 : విశాఖ నగరంలో ఆగస్టు 26 నుంచి 28 వరకు మూడు రోజులపాటు జరగనున్న సీపీఐ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని పార్టీ జిల్లా కార్యదర్శి మరుపిళ్ల పైడి రాజు పిలుపు నిచ్చారు. మధురవాడలోని పార్టీ కార్యాలయంలో గురువారం ఏరియా కమిటీని నియమించారు. మధురవాడ ఏరియా కార్యదర్శిగా వాండ్రాసి సత్యనారాయణ, సహాయ కార్యదర్శిగా గిడుతూరి వేలంగిణిరావు, సభ్యులుగా కొల్లి మేఘారావు, ఎండీ బేగం, కె.అరుణ్కుమార్, , బి.కేశవయ్య, ఎం.ఎస్.పాత్రుడు నియమితులయ్యారు. ఈ సందర్భంగా పైడిరాజు మాట్లాడుతూ 48 ఏళ్ల తరువాత నగరంలో మహాసభలు నిర్వహిస్తున్నామని, వీటిని జయప్రదం చేయాలని కోరారు.