జగనన్న లేఅవుట్‌ల్లో మౌలిక సదుపాయాలు లేవు

ABN , First Publish Date - 2022-11-15T00:47:20+05:30 IST

జగనన్న లేఅవుట్‌ల్లో మౌలిక సదుపాయాలు కల్పించడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని జనసేన నర్సీపట్నం నియోజకవర్గ ఇన్‌చార్జి రాజాన వీరసూర్యచంద్ర ఆరోపించారు.

జగనన్న లేఅవుట్‌ల్లో మౌలిక సదుపాయాలు లేవు
జోగంపేట జగనన్న లేఅవుట్‌ వద్ద ఆందోళన చేపడుతున్న జనసేన నాయకులు

గొలుగొండ, నవంబరు 14: జగనన్న లేఅవుట్‌ల్లో మౌలిక సదుపాయాలు కల్పించడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని జనసేన నర్సీపట్నం నియోజకవర్గ ఇన్‌చార్జి రాజాన వీరసూర్యచంద్ర ఆరోపించారు. జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ పిలుపు మేరకు సోమవారం మండలంలో జోగంపేటలో జగనన్న లేఅవుట్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలో పది జగనన్న లేఅవుట్లలో ఇళ్ల నిర్మాణాలు చేపట్టలేని పరిస్థితులు చోటుచేసుకున్నాయన్నారు. జగనన్న కాలనీల్లో వైసీపీ ప్రభుత్వం కనీస సౌకర్యాలు కల్పించలేదన్నారు. ఈ కార్యక్రమంలో నాలుగు మండలాలకు చెందిన జనసేన పార్టీ అధ్యక్షులు గండెం దొరబాబు, పొన్న పోతురాజు, రేగుబళ్ల శివ,తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-15T00:47:22+05:30 IST