ఉపాధి కార్యాలయంలో జాబ్ మేళా రేపు
ABN , First Publish Date - 2022-04-29T05:04:44+05:30 IST
కంచరపాలెంలోని జిల్లా ఉపాధి కార్యాలయంలో ఈనెల 30న జాబ్ మేళా నిర్వహించనున్నట్టు ఉపాధి కల్పనాధికారి సిహెచ్.సుబ్బిరెడ్డి తెలిపారు.
పదో తరగతి పాస్, ఫెయిల్ అభ్యర్థులు అర్హులు
విశాఖపట్నం, ఏప్రిల్ 28 : కంచరపాలెంలోని జిల్లా ఉపాధి కార్యాలయంలో ఈనెల 30న జాబ్ మేళా నిర్వహించనున్నట్టు ఉపాధి కల్పనాధికారి సిహెచ్.సుబ్బిరెడ్డి తెలిపారు. వోల్టాస్ ఫ్యాషన్ ప్రైవేట్ లిమిటెడ్, కోకో కోలా బేవరేజెస్ కంపెనీలు మేళాలో పాల్గొని యువతకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తాయని తెలిపారు. వోల్టాస్ ఫ్యాషన్లో చ్యూయింగ్ మెషిన్ ఆపరేటర్ ఉద్యోగాలు, కోకోకోలా కంపెనీలో హెల్పర్స్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. పదో తరగతి పాస్, ఫెయిల్ అయిన అభ్యర్థులు మేళాకు హాజరు కావచ్చునని, అర్హతను బట్టి వేతనం నిర్ణయిస్తారని తెలిపారు. ఔత్సాహికులు ఆ రోజు ఉదయం 10 గంటలకు హాజరు కావాలని సుబ్బిరెడ్డి సూచించారు. అభ్యర్థులు ముందుగా తమ పేర్లను నేషనల్ కెరీర్ సర్వీసెస్ పోర్టల్లో నమోదు చేసుకోవాలని తెలిపారు.