ఎరుకుమాంబ అమ్మవారికి జలాభిషేకం

ABN , First Publish Date - 2022-12-14T23:34:30+05:30 IST

దొండపర్తి పురవీఽధులలో వెలసిన ఎరుకుమాంబ అమ్మవారి ఆలయంలో అమ్మవారికి పసుపునీళ్లతో అభిషేకం ఘనంగా నిర్వహించారు.

ఎరుకుమాంబ అమ్మవారికి జలాభిషేకం
ఎరుకుమాంబ అమ్మవారు

దొండపర్తి, డిసెంబరు 14 : దొండపర్తి పురవీఽధులలో వెలసిన ఎరుకుమాంబ అమ్మవారి ఆలయంలో అమ్మవారికి పసుపునీళ్లతో అభిషేకం ఘనంగా నిర్వహించారు. బుధవారం అమ్మవారికి ప్రీతిపాత్రం కావడంతో పెద్దఎత్తున భక్తులు తరలివచ్చారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అమ్మవారికి భక్తులు పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు గంగవరపు శ్రీనివాసరావు స్వయంగా పర్యవేక్షించి భక్తులందరికీ దర్శనభాగ్యం కల్పించారు.

Updated Date - 2022-12-14T23:34:34+05:30 IST