జగన్కు చరిత్రలో మిగిలేది చెత్త పేజీనే: అచ్చెన్న
ABN , First Publish Date - 2022-11-25T03:55:38+05:30 IST
‘‘ప్రజల ఆస్తులు కరిగించేసి, కొండల్ని మింగేసి, ప్రజల నెత్తిపై లక్షలాది రూపాయల అప్పుపెట్టి పోయిన జగన్రెడ్డికి చరిత్రలో మిగిలేది చెత్త పేజీనే’’ అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఎద్దేవా చేశారు.
అమరావతి, నవంబరు 24(ఆంధ్రజ్యోతి): ‘‘ప్రజల ఆస్తులు కరిగించేసి, కొండల్ని మింగేసి, ప్రజల నెత్తిపై లక్షలాది రూపాయల అప్పుపెట్టి పోయిన జగన్రెడ్డికి చరిత్రలో మిగిలేది చెత్త పేజీనే’’ అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఎద్దేవా చేశారు. గురువారం ఆయన ట్విటర్లో స్పందించారు. ‘‘అప్పుల్లో దేశంలోనే ఏపీ నంబర్ 1. కేంద్రాన్ని మోసం చేస్తున్నారు. కాగ్ను మోసం చేస్తున్నారు. కోర్టులను మోసం చేస్తున్నారు. అన్నింటికంటే ముఖ్యంగా నమ్మి ఓట్లు వేసిన ప్రజలనే మోసం చేస్తున్నారు. ప్రజలు వాస్తవాలు గ్రహించినరోజు జగన్రెడ్డికి చరిత్రలో మిగిలేది చెత్తపేజీనే’’ అన్నారు.