1న జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశం
ABN , First Publish Date - 2022-11-30T00:25:25+05:30 IST
జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశం డిసెంబరు ఒకటిన జరగనున్నట్టు గ్రేటర్ కార్యదర్శి పి.నల్లనయ్య తెలిపారు.
28 అంశాలతో అజెండా
విశాఖపట్నం, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశం డిసెంబరు ఒకటిన జరగనున్నట్టు గ్రేటర్ కార్యదర్శి పి.నల్లనయ్య తెలిపారు. మేయర్ గొలగాని హరి వెంకటకుమారి అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి సంబంధించి 28 అంశాలతో అజెండా తయారుచేసి సభ్యులకు అందజేశామన్నారు.