చెత్త, ఆస్తి ఆధారిత పన్నులు రద్దు చేయాలి
ABN , First Publish Date - 2022-08-09T06:18:27+05:30 IST
జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో చెత్త, ఆస్తి ఆధారిత పన్నులు రద్దు చేస్తూ తీర్మా నం చేయాలని సీపీఎం కార్పొరేటర్ గంగారావు డిమాండ్ చేశారు.
సీపీఎం డిమాండ్
విశాఖపట్నం, ఆగస్టు 8: జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో చెత్త, ఆస్తి ఆధారిత పన్నులు రద్దు చేస్తూ తీర్మా నం చేయాలని సీపీఎం కార్పొరేటర్ గంగారావు డిమాండ్ చేశారు. పిఠాపురం కాలనీ సీపీఎం కార్యాలయంలో సోమవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నడూ లేని విధంగా పన్నులు విధిస్తోం దన్నారు. ఈ నెల 10న కౌన్సిల్ సమావేశం సందర్భంగా జీవీఎంసీ కార్యాలయం ముందు ధర్నా చేపడతున్నామన్నారు.
ప్రజలు స్వచ్ఛందంగా ధర్నాలో పాల్గొని తమ నిరసన తెలపాలని పిలుపునిచ్చారు. కార్యదర్శి జగ్గునాయుడు మాట్లాడుతూ చట్ట విరుద్ధమైన చెత్త పన్ను రద్దు చేయాలని సీపీఎం కోర్టును ఆశ్రయించిందని, ప్రస్తుతం ఇది విచారణలో ఉందన్నారు. ఇటీవల గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజలు మంత్రులను సైతం పన్నుల విషయంలో నిలదీశారన్నారు. అందుకే పన్నులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సీపీఎం నాయకులు ఆర్.కె.ఎస్.వి.కుమార్, కృష్ణారావు పాల్గొన్నారు.