రాజధాని భూములపై రైతులకు హక్కులేదు

ABN , First Publish Date - 2022-11-16T02:57:27+05:30 IST

కోర్టు పరిధిలో ఉన్న రాజధాని భూముల అంశంపై ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

రాజధాని భూములపై రైతులకు హక్కులేదు

అమరావతి నిర్మాణం వందేళ్లయినా పూర్తికాదు: ఎమ్మెల్సీ డొక్కా

గుంటూరు, నవంబరు 15(ఆంధ్రజ్యోతి): కోర్టు పరిధిలో ఉన్న రాజధాని భూముల అంశంపై ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అమరావతి రాజధాని రైతులకు ఆ భూములపై ఎటువంటి హక్కులూ లేవన్నారు. గుంటూరు జిల్లాపరిషత్‌ సర్వసభ్య సమావేశంలో మంగళవారం ఆయన మాట్లాడుతూ రోడ్డుకు భూమి ఇచ్చిన తరువాత యజమానికి దానిపై ఎటువంటి హక్కులూ ఉండవని చెప్పారు. అదే తరహాలో రాజధానికి భూములిచ్చిన రైతులకు ఆ భూములపై హక్కులు ఉండవన్నారు. వారు పరిహారం కోసం పోరాడాలని సూచించారు. రైతులు కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. వందేళ్లయినా అమరావతి రాజధాని నిర్మాణం పూర్తికాదన్నారు. ‘మా విధానం మూడు రాజధానులు’ అని స్పష్టం చేశారు. రాజధాని ప్రాంతంలో ప్రభుత్వానికి సుమారు 50 వేల ఎకరాల లాండ్‌బ్యాంక్‌ ఉందని చెప్పారు. 30 వేల ఎకరాలను 60 వేల మంది పేదరైతులు, కుటుంబాలకు అర ఎకరం చొప్పున ‘ఏక్‌సాల్‌’ పట్టాలివ్వాలని సూచించారు.

Updated Date - 2022-11-16T02:57:29+05:30 IST