రాష్ట్రంలో రాక్షస పాలన

ABN , First Publish Date - 2022-10-29T00:05:45+05:30 IST

రాష్ట్రంలో వైసీపీ రాక్షస పాలన సాగిస్తున్నదని అరకు పార్లమెంట్‌ నియోజకవర్గ జనసేన ఇన్‌చార్జి వంపూరు గంగులయ్య అన్నారు.

రాష్ట్రంలో రాక్షస పాలన
సమావేశంలో మాట్లాడుతున్న జనసేన నేత గంగులయ్య

బోయలు, బొంతు ఒరియాలను ఎస్టీ జాబితాలో చేర్చితే ఆందోళన

అరకు పార్లమెంట్‌ నియోజకవర్గ జనసేన ఇన్‌చార్జి గంగులయ్య

చింతపల్లి, అక్టోబరు 28: రాష్ట్రంలో వైసీపీ రాక్షస పాలన సాగిస్తున్నదని అరకు పార్లమెంట్‌ నియోజకవర్గ జనసేన ఇన్‌చార్జి వంపూరు గంగులయ్య అన్నారు. చింతలూరు గ్రామంలో శుక్రవారం పార్టీ ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. అనంతరం విలేకర్లతో ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నదన్నారు. రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను కాల రాయడం అన్యాయమన్నారు. విశాఖపట్నంలో శాంతియుతంగా జనవాణి కార్యక్రమం నిర్వహించేందుకు వచ్చిన జనసేన అధినేత పవన్‌ కల్యాన్‌ బలవంతంగా పోలీసులు వెనక్కి పంపడం దారుణమన్నారు. వైసీపీ ప్రభుత్వానికి రానున్న ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు. అలాగే బోయవాల్మీకి, బెంతు ఒరియా కులాలను ఏస్టీ జాబితాలో చేర్చితే ఆందోళన ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. వైసీపీ గిరిజన ప్రజాప్రతినిధులు మౌనాన్ని కొనసాగిస్తే గిరిజన ద్రోహులుగా మిగిలిపోతారన్నారన్నారు. సమావేశంలో జనసేన నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2022-10-29T00:05:52+05:30 IST