టీడీపీ క్రిస్టియన్‌ సెల్‌ అధ్యక్షుడుగా డేవిడ్‌

ABN , First Publish Date - 2022-06-10T04:53:23+05:30 IST

తెలుగుదేశంపార్టీ విశాఖ పార్లమెంటరీ క్రిస్టియన్‌ సెల్‌ అధ్యక్షునిగా మల్కాపురం ప్రాంతానికి చెందిన ఉరుకూటి డేవిడ్‌, ప్రధాన కార్యదర్శిగా సెల్వ్‌రాజు (విశాఖ తూర్పు) ను నియమించారు.

టీడీపీ క్రిస్టియన్‌ సెల్‌ అధ్యక్షుడుగా డేవిడ్‌
ఉరుకూటి డేవిడ్‌

విశాఖపట్నం, జూన్‌ 9 (ఆంధ్రజ్యోతి): తెలుగుదేశంపార్టీ విశాఖ పార్లమెంటరీ క్రిస్టియన్‌ సెల్‌ అధ్యక్షునిగా మల్కాపురం ప్రాంతానికి చెందిన ఉరుకూటి డేవిడ్‌, ప్రధాన కార్యదర్శిగా సెల్వ్‌రాజు (విశాఖ తూర్పు) ను నియమించారు. వారితోపాటు క్రిస్టియన్‌ సెల్‌ కార్యవర్గాన్ని పార్టీ విశాఖ  అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గురువారం విడుదలచేశారు. సెల్‌ ఉపాధ్యక్షులుగా కె.పద్మకుమార్‌(భీమిలి),వి. సాల్మన్‌ రాజు( విశాఖ తూర్పు), కృపాకరన్‌( విశాఖ పశ్చిమ), సాల్మన్‌రాజ్‌ (విశాఖ ఉత్తర),ఎం. మణిపురి కిషోర్‌( విశాఖ దక్షిణ),ఎం. ఆనంద్‌(గాజువాక), అఽఽధికారిక ప్రతినిధులుగా డి. సుందర్‌సింగ్‌, మారాడి హరి, ఎస్‌.వినోద్‌కుమార్‌, జోమాక్‌వెల్‌, ఎం.లక్ష్మి, జాన్‌ప్రకాష్‌, బి.రాజు, ఎం.సింహాచలంను నియమించారు. ఇంకా 10మంది ఆర్గనైజింగ్‌ కార్యదర్శులు, 15 మంది కార్యదర్శులు, ఎక్స్‌ ఆఫిషియో ఉపాధ్యక్షులుగా ఏడుగురు. సోషల్‌ మీడియా కోఆర్డినేటర్లుగా ఇద్దరు, మీడియా కోఆర్డినేటరుగా ఒకరిని నియమించారు.  


Updated Date - 2022-06-10T04:53:23+05:30 IST