సంపద కేంద్రాలను ఆదాయ వనరుగా తీర్చిదిద్దండి

ABN , First Publish Date - 2022-12-07T00:38:23+05:30 IST

పంచాయతీల అభివృద్ధికి ఉపయోగపడే సంపద కేంద్రాలను ఆదాయ వనరుగా తీర్చిదిద్దాలని జిల్లా పంచాయతీ వనరుల కేంద్రం కో-ఆర్డినేటర్‌ నాగలక్ష్మి అన్నారు.

సంపద కేంద్రాలను ఆదాయ వనరుగా తీర్చిదిద్దండి
కొవ్వూరులో సంపద కేంద్రాన్ని పరిశీలిస్తున్న నాగలక్ష్మి

రోలుగుంట, డిసెంబరు 6 : పంచాయతీల అభివృద్ధికి ఉపయోగపడే సంపద కేంద్రాలను ఆదాయ వనరుగా తీర్చిదిద్దాలని జిల్లా పంచాయతీ వనరుల కేంద్రం కో-ఆర్డినేటర్‌ నాగలక్ష్మి అన్నారు. మంగళవారం మండలంలోని కొవ్వూరు, నిండుగొండ, కంచుగుమ్మల, జేపీ అగ్రహారం, కుసర్లపూడి గ్రామాల్లో సంపద కేంద్రాలను ఆమె పరిశీలించారు. వానపాముల పెంపకం, ఎరువుల తయారీ, తడి చెత్త, పొడి చెత్త వాటి వినియోగంపై తగిన చర్యలు తీసుకొని పంచాయతీ ఆర్థిక అభివృద్ధికి కృషి చేయాలన్నారు. అనంతరం ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఈవోపీఆర్‌డీ మల్లికార్జునరావు, ఆయా గ్రామాల కార్యదర్శులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-07T00:38:26+05:30 IST