గోస్తనీ నదిపై వంతెన నిర్మాణం చేపట్టాలి
ABN , First Publish Date - 2022-01-20T06:13:53+05:30 IST
మండలంలో చిలకలగెడ్డ నుంచి పసిని, మర్రివలస గ్రామాలకు వెళ్లే మార్గంలో జీలుగులుపాడు వద్ద గోస్తనీ నదిపై వంతెన నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలంటూ జడ్పీటీసీ సభ్యుడు దీసరి గంగరాజు ఆధ్వర్యంలో స్థానికులు బుధవారం ఆందోళన చేశారు.
జడ్పీటీసీ సభ్యుడు గంగరాజు ఆధ్వర్యంలో ఆందోళన
అనంతగిరి రూరల్, జనవరి 19: మండలంలో చిలకలగెడ్డ నుంచి పసిని, మర్రివలస గ్రామాలకు వెళ్లే మార్గంలో జీలుగులుపాడు వద్ద గోస్తనీ నదిపై వంతెన నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలంటూ జడ్పీటీసీ సభ్యుడు దీసరి గంగరాజు ఆధ్వర్యంలో స్థానికులు బుధవారం ఆందోళన చేశారు. వంతెన నిర్మాణానికి రూ.2.4 కోట్లు మంజూరైనట్టు ఇటీవల అధికారులు వెల్లడించారని, కానీ ఇంతవరకు పనులు మొదలుపెట్టలేదని అన్నారు. వెంటనే టెండరు ప్రక్రియ పూర్తిచేసి వర్షాకాలం వచ్చేలాగా పనులు పూర్తిచేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చిలకలగెడ్డ సర్పంచ్ అప్పారావు, రొంపల్లి ఎంపీటీసీ మాజీ సభ్యుడు గంగులు, సీపీఎం నాయకులు నాగులు, సింగులు, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.