బౌద్ధ భిక్షువులు బుద్ధ విహార్ సందర్శన
ABN , First Publish Date - 2022-01-19T04:52:22+05:30 IST
స్థానిక ఇండస్ట్రియల్ కాలనీలోని బుద్ధ విహార్ (సిద్ధార్థ నిలయం)ను మయన్మార్ నుంచి వచ్చిన బౌద్ధ భిక్షువులు వెనరబుల్ ఆయుపాల మహాధేరో, మహాబోధి సొసైటీ సంఘపాల్ బంతేజీ మంగళవారం సందర్శించారు.
మల్కాపురం, జనవరి 18: స్థానిక ఇండస్ట్రియల్ కాలనీలోని బుద్ధ విహార్ (సిద్ధార్థ నిలయం)ను మయన్మార్ నుంచి వచ్చిన బౌద్ధ భిక్షువులు వెనరబుల్ ఆయుపాల మహాధేరో, మహాబోధి సొసైటీ సంఘపాల్ బంతేజీ మంగళవారం సందర్శించారు. అనంతరం బౌద్ధంపై ప్రవచనాలు చేశారు. ఈ కార్యక్రమంలో సిద్ధార్థ నిలయం ప్రతినిధి పెయ్యాల సిద్ధార్థ, అంబేడ్కర్ ఫెలోషిప్ అవార్డు గ్రహీత యూవీ రావు, ప్రముఖ బౌద్ధ ఉపాసకులు గుణపూడి బాబులు, బోర వేణుగోపాల్, గౌతమ్ తదితరులు పాల్గొన్నారు.