ఎస్‌హెచ్‌జీలకు రూ.1.55 కోట్ల బ్యాంకు లింకేజీ

ABN , First Publish Date - 2022-12-31T00:12:38+05:30 IST

ఏజెన్సీలో 38 స్వయం సహాయక సంఘాలకు ఆర్థిక తోడ్పాటును అందించేందుకు రూ.1.55 కోట్ల బ్యాంకు లింకేజీ చెక్కును కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ సంఘాల లీడర్లకు శుక్రవారం అందించారు.

ఎస్‌హెచ్‌జీలకు రూ.1.55 కోట్ల బ్యాంకు లింకేజీ
బ్యాంకు లింకేజీ చెక్కు అందిస్తున్న కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌, పక్కన ఐటీడీఏ పీవో గోపాలక్రిష్ణ

పాడేరు, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): ఏజెన్సీలో 38 స్వయం సహాయక సంఘాలకు ఆర్థిక తోడ్పాటును అందించేందుకు రూ.1.55 కోట్ల బ్యాంకు లింకేజీ చెక్కును కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ సంఘాల లీడర్లకు శుక్రవారం అందించారు. చింతపల్లి సబ్‌ డివిజన్‌ పరిధిలోని 38 స్వయం సహాయక సంఘాలకు చింతపల్లి యూనియన్‌ బ్యాంకు అధికారులు రూ.1.55 కోట్ల బ్యాంకు లింకేజీ సదుపాయాన్ని కల్పించారు. ఇందుకు సంబంధించిన చెక్కును కలెక్టర్‌ చేతుల మీదుగా వారికి అందించారు. ఈ కార్యక్రమంలో లీడ్‌ మేనేజర్‌ రవితేజ, డీఆర్‌డీఏ పీడీ వి.మురళీ పాల్గొన్నారు.

Updated Date - 2022-12-31T00:12:42+05:30 IST