Jagan సీఎంగా ఇంకా ఎలా పదవిలో కొనసాగుతున్నారు?: బండారు సత్యనారాయణ
ABN , First Publish Date - 2022-06-08T20:26:00+05:30 IST
వైఎస్ వివేకా (Viveka) హత్య కేసులో సీబీఐ (CBI) అధికారులు విచారణలో భాగంగా పులివెందులలో...
Visakha: వైఎస్ వివేకా (Viveka) హత్య కేసులో సీబీఐ (CBI) అధికారులు విచారణలో భాగంగా పులివెందులలో సీఎం జగన్ (Jagan) ఇంటి వద్దకు వెళ్లినా.. ఆయన ముఖ్యమంత్రిగా ఇంకా ఎలా పదవిలో కొనసాగుతున్నారని టీడీపీ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి (Bandaru Satyanarayana Murthy) ప్రశ్నించారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ పులివెందులలో జగన్ ఇంటికి సీబీఐ ఏమంత అమాయకంగా వెల్లిందనుకోవట్లేదన్నారు. నైతిక విలువలు ఉంటే తక్షణమే జగన్ సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పదవీ కాంక్షతో ఎంతవరకైనా వెళ్లే తత్వం జగన్ రెడ్డిదన్నారు. జగన్ బెయిల్ రద్దు చేసి, మళ్లీ జైలుకు పంపకపోతే సునీత పోరాటానికి ఫలితం ఉండదని సత్యనారాయణ మూర్తి అన్నారు.