ఏయూ అంతర్‌ కళాశాలల ఫుట్‌బాల్‌ విజేత ‘ఏవీఎన్‌’

ABN , First Publish Date - 2022-12-07T01:20:43+05:30 IST

ఆంధ్ర విశ్వవిద్యాలయం స్పోర్ట్సు బోర్డు నిర్వహించిన ఏయూ అంతర్‌ కళాశాలల పురుషుల ఫుట్‌బాల్‌ టోర్నీలో ఏవీఎన్‌ కళాశాల చాంపియన్‌ ట్రోఫీని కైవసం చేసుకుంది.

ఏయూ అంతర్‌ కళాశాలల ఫుట్‌బాల్‌ విజేత ‘ఏవీఎన్‌’
విజేత ఏవీఎన్‌ కాలేజీ క్రీడాకారులతో అతిఽథులు

విశాఖపట్నం(స్పోర్ట్సు), డిసెంబరు 6: ఆంధ్ర విశ్వవిద్యాలయం స్పోర్ట్సు బోర్డు నిర్వహించిన ఏయూ అంతర్‌ కళాశాలల పురుషుల ఫుట్‌బాల్‌ టోర్నీలో ఏవీఎన్‌ కళాశాల చాంపియన్‌ ట్రోఫీని కైవసం చేసుకుంది. డాక్టర్‌ ఎల్బీ కాలేజీ రన్నరప్‌గా నిలిచింది. మంగళవారం ఏయూ గ్రౌండ్‌లో జరిగిన ఫైనల్స్‌లో ఏవీఎన్‌ 1-0 గోల్‌తో బుల్లయ్యపై విజయం సాధించింది. ఏయూ కాలేజీ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ తృతీయ స్థానం దక్కించుకుంది. టోర్నీ ముగింపు కార్యక్రమానికి ఏయూ రిజిస్ర్టార్‌ ప్రొఫెసర్‌ వి.కృష్ణమోహన్‌, ఏయూ ఇంజనీరింగ్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ పేరి శ్రీనివాసరావు, ఏయూ పాలకమండలి సభ్యుడు ఆచార్య జేమ్స్‌ స్టీఫెన్‌ ముఖ్య అతిఽథులుగా హాజరై విజేతలకు ట్రోఫీలు అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏయూ స్పోర్ట్సు బోర్డు కార్యదర్శి, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ స్పోర్ట్సు సైన్సెస్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ ఎన్‌.విజయ్‌మోహన్‌, ఏవీఎన్‌ కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌ ఆచార్య సింహాద్రినాయుడు, ఫిజికల్‌ డైరెక్టర్లు వాసుదేవరాజు, లక్ష్మణ్‌, వై.శ్రీనివాసరావు, బీఆర్‌ఎస్‌ లక్ష్మణరెడ్డి, గోపీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-07T01:20:46+05:30 IST