మురిసిన మువ్వన్నెల జెండా
ABN , First Publish Date - 2022-08-14T06:04:11+05:30 IST
ఐటీడీఏ ఆధ్వర్యంలో ఆజాదీకా అమృత్ మహోత్సం హర్ ఘర్ తిరంగాలో భాగంగా 400 మీటర్ల భారీ జాతీయ జెండాతో జిల్లా కేంద్రం పాడేరులో శనివారం భారీ ర్యాలీ నిర్వహించారు.
పాడేరులో ఉత్సాహంగా హర్ ఘర్ తిరంగా ర్యాలీ
పాడేరు, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): ఐటీడీఏ ఆధ్వర్యంలో ఆజాదీకా అమృత్ మహోత్సం హర్ ఘర్ తిరంగాలో భాగంగా 400 మీటర్ల భారీ జాతీయ జెండాతో జిల్లా కేంద్రం పాడేరులో శనివారం భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక తలారిసింగి ఆశ్రమ పాఠశాల నుంచి అంబేడ్కర్ కూడలి వరకు వందలాది మంది ఉద్యోగులు, విద్యార్థులతో ర్యాలీ ఉత్సాహంగా సాగింది. అనంతరం భారీ జాతీయ జెండాతో అంబేడ్కర్ కూడలి వద్ద ఏర్పాటు చేసిన మానవహారం అందర్నీ విశేషంగా ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పీవో రోణంకి గోపాలక్రిష్ణ, జాయింట్ కలెక్టర్ జె.శివశ్రీనివాసు, సబ్కలెక్టర్ వి.అభిషేక్, గిరిజన సంక్షేమ విద్యాశాఖ ఉప సంచాలకుడు ఐ.కొండలరావు, ఐటీడీఏ ఏపీవో ఎం.వెంకటేశ్వరరావు, ఐటీడీఏ ఏవో హేమలత, ఆర్డబ్ల్యూఎస్ ఈఈ జవహార్కుమార్, జిల్లా వ్యవసాయాధికారి ఎస్బీఎస్ నంద్, పీహెచ్వో శరత్, ఏటీడబ్ల్యూవో ఎల్.రజని, వివిధ డిగ్రీ, జూనియర్ కళాశాలలు, పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.