Visakha Corporators: కులూమనాలిలో విరిగిపడ్డ కొండచరియలు... చిక్కుకుపోయిన విశాఖ కార్పొరేటర్ల బృందం
ABN , First Publish Date - 2022-08-20T15:11:05+05:30 IST
ఉత్తర భారత దేశంలోని మున్సిపాలిటీల్లో పర్యటనకు వెళ్లిన విశాఖ కార్పొరేటర్లు కొండచరియలు విరిగిపడటంతో చిక్కుకుపోయారు.
విశాఖపట్నం: ఉత్తర భారత దేశంలోని మున్సిపాలిటీల్లో పర్యటనకు వెళ్లిన విశాఖ కార్పొరేటర్లు (Visakhapatnam Corporators) కొండచరియలు (Landslides) విరిగిపడటంతో చిక్కుకుపోయారు. కులూమనాలి నుండి ముండి మధ్య వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో కార్పొరేటర్ల బృందం మధ్యలో ఇరుక్కుపోయింది. గత రాత్రి మనాలి నుండి చండీగఢ్ వెళుతుండగా మార్గ మధ్యలో లారీపై కొండచరియలు విరిగిపడటంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో ఎటు వెళ్లేందుకు ఆస్కారం లేక, రాత్రి నుండి మధ్యలో కార్పొరేటర్లు, కుటుంబ సభ్యులు చిక్కుకుపోయారు. 70 మందిలో 27 మంది కార్పొరేటర్లు (Corporators) ఆరోగ్యం సరిగా లేకపోవడంతో మనాలిలో ఉండిపోగా.. మిగిలినవారంతా బస్సులో ఇరుక్కున్నారు.